ఇస్లామాబాద్: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు మళ్లీ కాలు మోపింది. పాకిస్తాన్తో రెండు టెస్టులు, మూడు టి20లు ఆడేందుకు క్వింటన్ డికాక్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు శనివారం కరాచీలో అడుగు పెట్టింది. చివరిసారిగా పాకిస్తాన్ వేదికగా ఈ రెండు జట్లు 2007లో టెస్టు సిరీస్ ఆడగా... దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ నెగ్గింది. అనంతరం 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో పాక్లో క్రికెట్ ఆడేందుకు ఇతర జట్లు విముఖత చూపాయి. దాంతో కొన్ని సంవత్సరాలపాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా సిరీస్లను నిర్వహించింది. అక్కడ పాకిస్తాన్... దక్షిణాఫ్రికాతో రెండు పర్యాయాలు (2010, 2013) టెస్టు సిరీస్ ఆడటం విశేషం. ప్రస్తుత పర్యటనలో భాగంగా తొలి టెస్టు కరాచీ వేదికగా ఈ నెల 26–30 మధ్య... రెండో టెస్టు రావల్పిండిలో ఫిబ్రవరి 4–8 మధ్య జరగనున్నాయి. టి20 సిరీస్కు లాహోర్ ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి 11, 13, 14 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి.
14 ఏళ్ల తర్వాత...
Published Sun, Jan 17 2021 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement