రిత్విక్‌ జోడీ శుభారంభం     | Sakshi
Sakshi News home page

రిత్విక్‌ జోడీ శుభారంభం    

Published Thu, Apr 18 2024 5:00 AM

Ritvik Jodi is off to a good start - Sakshi

జీఎన్‌పీ సెగురోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ శుభారంభం చేశాడు. మెక్సికోలోని అకాపుల్కో నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్‌లో రిత్విక్‌–నిక్కీ పునాచా (భారత్‌) ద్వయం 7–5, 6–2తో యువాన్‌ పాబ్లో ఫిచోవిచ్‌ (అర్జెంటీనా)–లుకాస్‌ రెస్‌ డా సిల్వా (బ్రెజిల్‌) జోడీపై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.  

Advertisement
Advertisement