Sakshi News home page

సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సహజ 

Published Fri, Mar 1 2024 4:18 AM

Sahaja in the singles quarters - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత రెండో ర్యాంకర్‌ సహజ యామలపల్లి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 329వ ర్యాంకర్‌ సహజ 7–6 (10/8), 7–5తో భారత్‌కే చెందిన రియా భాటియాను  ఓడించింది.

మరోవైపు తెలంగాణకే చెందిన మరో ప్లేయర్‌ శ్రీవల్లి రషి్మక రెండో రౌండ్‌లో 6–1, 3–6, 6–7 (5/7)తో ఏడో సీడ్‌ జాక్వెలిన్‌ కబాజ్‌ అవాద్‌ (స్వీడన్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది.  

Advertisement

What’s your opinion

Advertisement