World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
Published
Fri, Oct 6 2023 8:20 AM
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడికి డెంగ్యూ పాజిటివ్గా తేలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్కు గిల్ దూరమయ్యే ఛాన్స్ ఉంది.
గిల్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. కాగా గిల్కు శుక్రవారం మరోసారి రక్తపరీక్షలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితం బట్టి జట్టు మేనెజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా గిల్ ప్రస్తుతం అద్బుతమనైన ఫామ్లో ఉన్నాడు.