టీమిండియా యువ క్రికెటర్ శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లండ్తో టెస్టులతో బిజీగా ఉన్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్లో ఇప్పటి మూడు మ్యాచ్లు ఆడిన ఈ పంజాబీ బ్యాటర్ ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది.
వైజాగ్ టెస్టులో 104 పరుగులు చేసిన గిల్.. రాజ్కోట్లో జరిగిన మూడో మ్యాచ్లో శతకానికి తొమ్మిది పరుగుల దూరం(91)లో నిలిచిపోయాడు. అయితే, ఈ రెండు మ్యాచ్లలోనూ టీమిండియా గెలవడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం రాంచి టెస్టుకు సన్నద్ధమవుతున్న శుబ్మన్ గిల్ విరామ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించాడు. ఈ క్రమంలో ఓ ఫ్యాన్ గిల్ దృష్టిని ఆకర్షించేందుకు.. ‘‘ఈ రీల్పై గనుక గిల్ కామెంట్ చేస్తే.. నేను రేపటి నుంచే చదువుపై శ్రద్ధ పెడతాను’’ అని వ్యాఖ్యానించాడు.
ఇందుకు బదులుగా.. ‘‘ఇక చదవడం మొదలుపెట్టు మరి’’ అని శుబ్మన్ గిల్ రిప్లై ఇచ్చాడు. ఈ నేపథ్యంలో.. ‘‘మనిషి జీవితంలో చదువుకు ఎంత ప్రాముఖ్యం ఉందో గిల్ తన విలువైన సమయాన్ని అభిమాని కోసం కేటాయించడం ద్వారా నిరూపించాడు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పనిలో పనిగా.. సోషల్ మీడియాలో ఇలాంటి పనులు మానేసి చక్కగా చదువుకొమ్మని సదరు ఫ్యాన్కు చురకలు అంటిస్తున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాంచి వేదికగా ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రోహిత్ సేన 2-1తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.