ఫైనల్లో సౌత్‌జోన్‌ | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సౌత్‌జోన్‌

Published Sat, Apr 6 2024 1:39 AM

Southzone in the final - Sakshi

రాణించిన దుర్గా, తమన్నా  

పుణే: జాతీయ సీనియర్‌ మహిళల ఇంటర్‌ జోనల్‌ క్రికెట్‌ టోర్నీలో సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్‌ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సౌత్‌జోన్, వెస్ట్‌జోన్‌ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల తొలి సెమీఫైనల్‌ ‘డ్రా’గా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన కారణంగా సౌత్‌జోన్‌ జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 58/2తో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌జోన్‌ 101 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 262 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసి 322 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి, వికెట్‌ కీపర్‌ మిరియాల దుర్గ (205 బంతుల్లో 81; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... తమన్నా నిగమ్‌ (200 బంతుల్లో 99; 16 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకుంది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో వెస్ట్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడలేదు. నార్త్‌జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్‌ 135 పరుగుల తేడాతో గెలిచింది.  

Advertisement
Advertisement