Sakshi News home page

IND vs NZ: టీ20, వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా

Published Mon, Nov 14 2022 3:59 PM

Team India reaches New Zealand as NEW white ball series - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 సెమీఫైనల్లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పుడు న్యూజిలాండ్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌​కు సిద్దమైంది. ఈ సిరీస్‌​కోసం హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు సోమవారం న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌,మహ్మద్‌ సిరాజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఇక కివీస్‌ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు మంగళవారం నుంచి తమ ప్రాక్టీస్‌ సెషన్‌ను మొదలపెట్టనుంది. కాగా న్యూజిలాండ్‌ పర్యటనకు సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నారు.

మరోవైపు రాహల్‌ ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇవ్వడంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరో సారి హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.  నవంబర్‌ 18న వెల్లింగ్టన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్‌ టూర్‌ ప్రారంభం కానుంది.

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత టీ20 జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత వన్డే జట్టు..
శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషి​ంగ్టన్‌ సుందర్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

Advertisement
Advertisement