T20 WC 2022: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా
Published
Fri, Oct 28 2022 8:42 AM
టీ20 ప్రపంచకప్లో గురువారం పెర్త్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచి పసికూన్ నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్లో రోహిత్, కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ అర్ద సెంచరీలతో చెలరేగగా.. అనంతరం బౌలింగ్లో భువీ, అక్షర్, అశ్విన్, అర్ష్దీప్ అదరగొట్టారు.
ఇక ఈ మ్యాచ్లో 62 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచిన కింగ్ కోహ్లి ఓ అరుదైన ఘనతను సాధించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్లో 23 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 989 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ను కోహ్లి అధిగిమించాడు. టీ20 ప్రచంకప్లో 33 మ్యాచ్లు ఆడిన గేల్.. 965 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే 1016 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. చదవండి: T20 World Cup 2022: వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్ సెమీ ఫైనల్కు చేరే ఛాన్స్?