Sakshi News home page

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్‌ కోహ్లి దిగ్బ్రాంతి

Published Sat, Jun 3 2023 11:56 AM

Virat Kohli Wishes Speedy Recovery For Injured Passengers - Sakshi

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం ​చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు సూప‌ర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ ఢీకొన‌డంతో ఈ ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది.  ఈ ఘటనలో 270 పైగా మృత్యువాత పడగా.. 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ పెను ప్రమాదంపై భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.

మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని విరాట్‌ ట్వీట్‌ చేశాడు.
చదవండిWTC Final 2023: 50 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే.. ఆసీసీను భయపెడుతున్న చెత్త రికార్డు

Advertisement

తప్పక చదవండి

Advertisement