Sakshi News home page

Korea Open 2022: సెమీఫైనల్లో సాకేత్‌–యూకీ జోడీ

Published Fri, Sep 30 2022 10:06 AM

Yuki Bhambri Saketh Pair enters semi Final in korean open 2022 - Sakshi

కొరియా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు సాకేత్‌ మైనేని పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రి జోడీ 6–3, 6–4తో రోడ్రిగ్వెజ్‌ (కొలంబియా)–డీగో హిడాల్గొ (ఈక్వెడార్‌) జంటపై గెలుపొందింది.

నేడు జరిగే సెమీఫైనల్లో రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా)– నాథనిల్‌ లమన్స్‌ (అమెరికా) జోడీతో భారత ద్వయం పోటీపడుతుంది. మరో వైపు ఇజ్రాయెల్‌లో జరుగుతున్న టెల్‌ అవీవ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

క్వార్టర్స్‌లో బోపన్న–మిడిల్‌కూప్‌ జంట 4–6, 7–6(7/5), 10–5తో ఫ్రాంకో స్కుగొర్‌ (క్రొయేషియా)–డెనిస్‌ మొల్చనొవ్‌ (ఉక్రెయిన్‌) ద్వయంపై గెలిచింది. సెమీస్‌లో బోపన్న జోడీ... ఫ్రాన్స్‌కు చెందిన ఫాబియన్‌ రిబొల్‌–సాడియో డంబియా జంటతో తలపడుతుంది.
చదవండి: Sachin Tendulkar: బ్రెట్‌ లీ బౌలింగ్‌లో ట్రేడ్‌మార్క్‌ షాట్‌.. ఎన్నాళ్లయిందో

Advertisement
Advertisement