పురుగు మందు తాగిన వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2023 12:14 AM

-

బుచ్చిరెడ్డిపాళెం(విడవలూరు) : అనారోగ్యం కారణంగా పురుగుల మందు సేవించి చికిత్స పొందుతున్న ముంగర జగదీష్‌ (36) అనే వ్యక్తి మంగళవారం ఉదయం మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు కథనం మేరకు.. విడవలూరుకు చెందిన జగదీష్‌ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ బాధలను తట్టుకోలేక అతను గతనెల 24వ తేదీన పురుగు మందు సేవించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగవారం ఉదయం మృతి చెందాడని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement