దొడ్ల డెయిరీకి జాతీయస్థాయి భద్రతా అవార్డు | Sakshi
Sakshi News home page

దొడ్ల డెయిరీకి జాతీయస్థాయి భద్రతా అవార్డు

Published Tue, Mar 21 2023 12:08 AM

-

నెల్లూరు రూరల్‌: దేవరపాళెంలోని దొడ్ల డైయిరీకి జాతీయస్థాయి భద్రతా అవార్డు లభించినట్లు జనరల్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం డెయిరీలో ఆయన విలేకరులకు అవార్డు వివరాలను వెల్లడించారు. జాతీయ భద్రతా కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17న గోవాలో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో తమ డెయిరీ భద్రతా అవార్డును దక్కించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. జాతీయ భద్రతా కౌన్సిల్‌ ప్రతినిధులు డెయిరీని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అవార్డును ప్రకటించడం జరిగిందన్నారు. ప్రొడక్షన్‌ హెడ్‌ లక్ష్మణ్‌రెడ్డి, రీజనల్‌ హెచ్‌ఆర్‌ సుధాకర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారని తెలిపారు.

Advertisement
Advertisement