విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Published Thu, Nov 23 2023 12:28 AM

ఉప్పుటూరయ్య మృతదేహం  - Sakshi

నెల్లూరు రూరల్‌ : విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఉప్పుటూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక వడ్డిపాళెంలో ఉంటున్న బెల్లంకొండ ఉప్పుటూరయ్య(51) వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య పద్మమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన ఇంటికి ఎదురుగా సోదరుడు విజయకుమార్‌ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో విజయకుమార్‌ తన ఇంటి వద్ద అల్యూమినియం తీగలపై దుస్తులు ఆరేసే క్రమంలో షాక్‌కు గురై పెద్దగా కేకలు వేశాడు. వెంటనే ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని కర్రలతో అతన్ని రక్షించారు. కాగా తమ్ముడి ఇంటి నుంచి కేకలు రావడంతో ఉప్పుటూరయ్య అక్కడికి చేరుకుని శ్లాబ్‌ కమ్ములకు ఉన్న తీగలను తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను విజయ డెయిరీ చైర్మన్‌ రంగారెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Advertisement