నేటి ‘జగనన్నకు చెబుదాం’ వాయిదా | Sakshi
Sakshi News home page

నేటి ‘జగనన్నకు చెబుదాం’ వాయిదా

Published Fri, Nov 24 2023 12:22 AM

- - Sakshi

నెల్లూరు (దర్గామిట్ట): దుత్తలూరులో శుక్రవారం నిర్వహించాల్సిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని వాయిదా వేశామని కలెక్టర్‌ హరినారాయణన్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని పరిపాలన కారణాల రీత్యా వాయిదా వేశామని, తదుపరి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామన్నారు.

తహసీల్దార్ల బదిలీ

నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయం గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. గతంలో ఆత్మకూరు తహసీల్దార్‌గా పనిచేసిన లక్ష్మీనరసింహాన్ని ఏఎస్‌పేటకు.. కొండాపురం తహసీల్దార్‌గా వ్యవహరించిన హుస్సేన్‌ను కావలి ఆర్డీఓ కార్యాలయ ఏఓగా బదిలీ చేశారు.

టీ – 20 టోర్నీకి

దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట్‌): టీ – 20 క్రికెట్‌ టోర్నీకి ఔత్సాహిక క్రీడాకారుల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నామని క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి డీఎన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంట్రీ ఫీజుగా రూ.ఐదు వేలను నిర్ణయించామని చెప్పారు. పోటీల్లో పాల్గొనాలనుకునే వారు తమ క్రికెట్‌ క్లబ్‌ లెటర్‌ హెడ్‌పై 15 క్రీడాకారుల పేర్లను రాసి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని ఎన్డీసీఏ కార్యాలయంలో డిసెంబర్‌ ఐదులోపు అందజేయాలని కోరారు. వివరాలకు 83285 36679, 94414 44796 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఉదయగిరి సబ్‌ రిజిస్ట్రార్‌గా విజయరాణి

నెల్లూరు సిటీ: ఉదయగిరి రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ సబ్‌ రిజిస్ట్రా ర్‌గా విజయరాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో బాధ్యతలను గురువారం ఆమె స్వీకరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement