1,267 పొగాకు బేళ్ల విక్రయం | Sakshi
Sakshi News home page

1,267 పొగాకు బేళ్ల విక్రయం

Published Tue, Mar 26 2024 12:45 AM

-

కలిగిరి: మండల కేంద్రమైన కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో సోమవారం 524 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి మహేష్‌కుమార్‌ తెలిపారు. వివిధ కారణాలతో 63 బేళ్లను తిరస్కరించారన్నారు. కిలో పొగాకుకు గరిష్టంగా రూ.230, కనిష్టంగా రూ.220, సరాసరిన రూ.228.02 ధర లభించిందన్నారు.

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో సోమవారం 743 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలిపారు. 93,254 కిలోల పొగాకును కొనుగోలు చేశారన్నారు. కిలోకు గరిష్టంగా రూ.230, కనిష్టంగా రూ.220, సగటున రూ.228.70 ధర లభించిందన్నారు.

Advertisement
Advertisement