కలిగిరి: మండల కేంద్రమైన కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో సోమవారం 524 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి మహేష్కుమార్ తెలిపారు. వివిధ కారణాలతో 63 బేళ్లను తిరస్కరించారన్నారు. కిలో పొగాకుకు గరిష్టంగా రూ.230, కనిష్టంగా రూ.220, సరాసరిన రూ.228.02 ధర లభించిందన్నారు.
● మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో సోమవారం 743 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. 93,254 కిలోల పొగాకును కొనుగోలు చేశారన్నారు. కిలోకు గరిష్టంగా రూ.230, కనిష్టంగా రూ.220, సగటున రూ.228.70 ధర లభించిందన్నారు.