గుర్తుతెలియని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Mon, Apr 8 2024 12:15 AM

-

వెంకటాచలం: గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గొలగమూడిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గొలగమూడిలోని భగవాన్‌ శ్రీవెంకయ్యస్వామి ఆశ్రమ సమీపంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement