శాంతిభద్రతలపై రాజీలేదు | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలపై రాజీలేదు

Published Wed, May 17 2023 1:18 AM

సోమందేపల్లి పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేస్తున్న డీఐజీ అమ్మిరెడ్డి  - Sakshi

అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టాలి

ఫ్యాక్షన్‌ గ్రామాలపై దృష్టి సారించండి

డీఐజీ అమ్మిరెడ్డి

పెనుకొండ/సోమందేపల్లి/పెనుకొండ రూరల్‌: శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని డీఐజీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పెనుకొండ, సోమందేపల్లి, పెనుకొండ రూరల్‌ పరిధిలోని కియా పోలీసుస్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీసుస్టేషన్‌లో ఉన్న పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పలు కేసులపై ఆరా తీశారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడకూడదని సిబ్బందికి ఆధేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పక్కాగా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని , సైబర్‌ క్రైమ్‌, గృహహింస, గంజాయి రవాణా, మట్కా, పేకాట నిర్మూలనకు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వెలుగుమాకులపల్లి క్రాస్‌ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరిగే జంక్షన్‌ను డీఐజీ పరిశీలించారు. సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, వెంకటరమణ , సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement