అధిష్టాన నిర్ణయమే శిరోధారం | Sakshi
Sakshi News home page

అధిష్టాన నిర్ణయమే శిరోధారం

Published Thu, Nov 23 2023 12:44 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌  - Sakshi

హిందూపురం: వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీసత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో వెళుతున్న ఆయనను కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, కౌన్సిలర్లు పరుశురాం, అయూబ్‌, ఇర్షాద్‌, ముస్తాక్‌, లతీఫ్‌, సలీం, ఎంపీటీసీ శెట్టిపల్లి జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ప్రభాకర్‌రెడ్డి, చిలమత్తూరు నాయకులు నాగరాజు, రాజారెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. అభద్రతాభావాన్ని వీడి అందరితో కలసి పనిచేయాలన్నారు. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. అనంతరం పుట్టపర్తిలో కార్యక్రమం ముగించుకున్న ఆయన హిందూపురంలోని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాలరెడ్డి, లైఫ్‌వరల్డ్‌ చారిటబుల్‌ ట్రస్టు కన్వీనర్‌ ఉదయ్‌కుమార్‌, వీవర్స్‌ కాలనీ సలీం తదితర నాయకులను కలసి పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌

Advertisement
Advertisement