పుట్టపర్తి టౌన్: జిల్లాలో ‘సెబ్’ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు తనకల్లు, మడకశిర సెబ్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించారు. తనకల్లు సెబ్ స్టేషన్ పరిధిలో కమ్మవారిపల్లి క్రాస్ వద్ద 7 బాక్సుల కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఒక కారు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మడకశిర స్టేషన్ పరిధిలో 45 మద్యం ప్యాకెట్లు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
లేపాక్షి ఆలయ
హుండీ లెక్కింపు
లేపాక్షి: ప్రసిద్ధి చెందిన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలోని హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. ఆలయ కార్య నిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. 94 రోజులకు గాను రూ.2,35,818 ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి నాగేంద్రుడు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.