చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

Published Fri, Nov 24 2023 12:52 AM

-

సోమందేపల్లి: మండలంలోని కావేటి నాగేపల్లి వద్ద గోరంట్ల మండలంలో నూతనంగా నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్‌కు లైన్‌ లాగేందుకు ఉంచిన రూ.9.80 లక్షల విలువ చేసే కండెక్టర్‌ను రెండు వారాల క్రితం దుండగులు అపహరించుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈ నెల 11న కాంట్రాక్టర్‌ సుదర్శననాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ విజయ్‌కుమార్‌... పక్కా ఆధారాలతో 9 మంది నిందితులను గురువారం అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన వారందరూ కర్ణాటకలోని హొసకోటే ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన కండెక్టర్‌ను రికవరీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement