అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు

Published Tue, Nov 28 2023 1:22 AM

తాడిపత్రిలో సామాజిక సాధికార బస్సు యాత్రకు హాజరైన జనసందోహంలో ఓ భాగం - Sakshi

చంద్రబాబు ఏనాడూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన పాపానపోలేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ముందు సేవ్‌ తాడిపత్రి అని మొసలి కన్నీరు కార్చారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి పదవులు ఇస్తానని చెప్పి గెలిచారు. విజయం సాధించాక నమ్మిన వారిని వంచించారు. తినే తిండి నుంచి కట్టేబట్ట వరకు ప్రజల నుంచే దోచుకుంటున్నారు. తాడిపత్రిలో 20 షాపురూములను బినామీలకు కట్టబెట్టి బాడుగల ద్వారా బతికేస్తున్నారు. తాడిపత్రిలో ఏ అభివృద్ధి పని చేపట్టినా అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ ప్రహరీ నిర్మాణ పనులతో పాటు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పనులను అడ్డుకున్నారు. బీసీలు, మైనార్టీలకు ఆంజనేయస్వామి మాన్యంలో 750 పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డు తగిలారు. తాడిపత్రిలో ఆస్పత్రి నిర్మాణ పనులు చేయిస్తుంటే, కాంట్రాక్టర్‌, ఇతర కార్మికులను బెదిరిస్తున్నారు. ఇలాంటి లుచ్చాలు ప్రజాప్రతినిధులైతే తాడిపత్రి ఎలా సాధ్యం.

– కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే

1/1

Advertisement
Advertisement