రైతులతో సమావేశమైన నెదర్లాండ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు | Sakshi
Sakshi News home page

రైతులతో సమావేశమైన నెదర్లాండ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు

Published Fri, Dec 1 2023 12:54 AM

-

మడకశిర: నెదర్లాండ్‌ దేశానికి చెందిన రాబో బ్యాంక్‌ ప్రతినిధుల బృందం గురువారం ఉదయం మడకశిర ఎంపీడీఓ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. ఆర్డీటీ ఏఎఫ్‌ ఎకాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బ్యాంక్‌ ప్రతినిధులు లారా, ఆండ్రిజ్‌, జోరియాస్‌, సోఫియా, ఏఎఫ్‌ ఎకాలజీ ఫీల్డ్‌ కో ఆర్డినేటర్‌ శంకర్‌, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ రమేష్‌, హనుమంతు మాట్లాడుతూ.. కార్బన్‌ మధనం ప్రాజెక్ట్‌పై రైతులకు అవగాహన కల్పించారు. 2018 నుంచి ఇప్పటి వరకూ మామిడి, జామ, చింత, నేరేడు, సపోటా, ఉసిరి, చీనీ సాగు చేసిన రైతులు కార్బన్‌ మధనం ప్రాజెక్ట్‌లో చేరి లబ్ది పొందాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ సోనీబాయి, రైతులు నరసింహమూర్తి, జంపన్న, హనుమంతరాయప్ప, రాధారమణ, నర్సేగౌడ్‌, సూర్యనారాయణరెడ్డి, రవికుమార్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement