‘ఆడుదాం ఆంధ్రా’ను జయప్రదం చేయండి | Sakshi
Sakshi News home page

‘ఆడుదాం ఆంధ్రా’ను జయప్రదం చేయండి

Published Mon, Dec 4 2023 1:12 AM

-

కళ్యాణదుర్గం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం...ఆంధ్రా’ క్రీడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతకు మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌ పిలుపునిచ్చారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్త క్రీడాకార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని పెద్ద వేదికకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ తదితర క్రీడాంశాల్లో ఆసక్తి ఉన్న 15 ఏళ్లు పైబడిన వారు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వీరికి సచివాలయాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పోటీలు నిర్వహించి మొత్తంగా రూ.12 కోట్లకు పైగా బహుమతులను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. పేర్లను ‘ఆడుదాంఆంధ్రా.ఏపీ.జీఓవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో నేరుగా లేదా సమీపంలోని సచివాలయంలో కానీ, 1902కు కాల్‌ చేసి గాని నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement