శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను జిల్లా ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు బి.ధనుంజయరావు కోరారు. న్యూఢిల్లీ చేనేత జౌళి అభివృద్ధి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని టౌన్హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆదివారం ప్రారంభించారు. డీపీఆర్ఓ కేబీఎం సింగ్, చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఐ.ధర్మారావుతో కలిసి జ్యోతి ప్రజ్వల న చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తరువాత అతి పెద్ద వృత్తి చేనేత రంగం అని అన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలుచేస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. చేనేత కార్మికులు తయారుచేసే వస్త్రాలకు మార్కెటింగ్ ప్రధాన సమస్య అని, ఈ సమస్యను అధిగమించి కార్మికులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఇలాంటి వస్త్ర ప్రదర్శనలను ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఈ నెల 19 నుంచి 25 వరకు వివిధ రాష్ట్రాల వస్త్ర ప్రదర్శనతో పాటు విక్రయాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఐ.ధర్మారావు మాట్లాడుతూ ఎనిమిది జిల్లాలకు చెందిన సుమారు 20 సహకార ఉత్పత్తి సంఘాలకు చెందిన అన్ని రకాల వస్త్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వీటి తో పాటు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నుంచి కూడా వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. తక్కువ ధరకే లభించే వస్త్రాలను జిల్లా ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో ఆప్కో డివిజనల్ వాణిజ్యాధికారి సో మేశ్వరరావు, ఆప్కో డీఓ శేఖర్, లీలాకుమార్, ముఖర్జీ, వివిధ సహకార ఉత్పత్తి విక్రయ సంఘాల అధ్యక్షులు, మేనేజర్లు, సేల్స్ మెన్ తదితరులు పాల్గొన్నారు.
‘చేనేతకు చేయూతనందించాలి’
Published Mon, Mar 20 2023 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement