‘వైఎస్‌ జగన్‌తోనే బహుజన సాధికారత సాధ్యం’ | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌తోనే బహుజన సాధికారత సాధ్యం’

Published Sat, Oct 21 2023 12:30 AM

-

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్రంలో బహుజనుల సంక్షేమం, వారి ప్రగతి, అన్ని రంగాల్లో సాధికారత సీఎం వైఎస్‌ జగన్‌ పాలనతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అవకాశాలు ఇచ్చిన ఏకై క పార్టీ వైఎస్సార్‌ సీపీ అని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతున్న ప్రభుత్వ తమదేన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు బాగు చేశా మని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారు అవమానాలకు గురయ్యారని తెలిపారు. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారని ఆయన లేఖ రాసిన అంశా న్ని గుర్తు చేశారు. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి తోక లు కట్‌ చేస్తామన్నారని, మత్స్యకారులకు తోలు తీస్తామన్నారని, ఎస్సీలుగా పుట్టేందుకు ఎవరు కోరుకుంటారంటూ బాబు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మోడరన్‌ అన్‌టచ్‌బులిటీకి చంద్రబా బు నిదర్శనమని అన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడి హోదా ఏనాడైనా అనుభవించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హ యాంలో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. నాడు క్యాబినెట్‌ను మోసం చేసి చంద్రబాబు డబ్బులు కొట్టేశారని తెలిపారు. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై రామోజీరావు ఎందుకు వార్తలు రాయడం లేదని ప్రశ్నించారు.

Advertisement
Advertisement