మెడికల్‌ పీజీ సెట్‌లో లావణ్య ప్రతిభ | Sakshi
Sakshi News home page

మెడికల్‌ పీజీ సెట్‌లో లావణ్య ప్రతిభ

Published Sun, Nov 12 2023 12:28 AM

జి.లావణ్య  - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పీజీ అర్హత పరీక్షలో శ్రీకాకుళం నగరానికి చెందిన గురుగుబెల్లి లావణ్య ప్రతిభ కనబర్చింది. ఎన్‌ఐసెట్‌ జనవరి–2024 పీజీ అర్హత పరీక్షలో 488వ ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ డిస్టెన్షన్‌లో ఉత్తీర్ణత సాధించిన లావణ్య నగరంలోని గుజరాతీపేటలో నివాసం ఉంటున్నారు. తండ్రి గురుగుబెల్లి జనక మోహనరావు, తల్లి పద్మావతమ్మ ఇద్దరు ఉపాధ్యాయులగా పనిచేస్తుండగా, అన్నయ్య గురుగుబెల్లి వెంకటేష్‌ శ్రీకాకుళం రిమ్స్‌లో ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు.

Advertisement
Advertisement