Sakshi News home page

బాల్య వివాహాలను నిర్మూలిద్దాం

Published Fri, Nov 17 2023 12:54 AM

ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది 
 - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: బాల్య వివాహాలు జరగకుండా అంగన్‌వాడీ సిబ్బందితో పాటు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్‌ శ్రీకాకుళం అర్బన్‌ ప్రాజెక్టు సీడీపీవో ఎ.శోభారాణి అన్నారు. ప్రాజెక్ట్‌ కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు, బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జీవితం నాశనమవుతుందన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బాలల రక్షణ అధికారులు ఇప్పిలి లక్ష్మీనాయుడు, మెట్ట మల్లేశ్వరరావు, ఓఆర్‌డబ్ల్యూ ఎ.గీత, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కేస్‌ వర్కర్‌ డి.రాజు, సూపర్‌వైజర్లు యశోద, ఉమ, సీతామహాలక్ష్మి, మహిళా సంరక్షణ కార్యదర్శలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement