రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం

Published Sat, Nov 18 2023 12:34 AM

-

రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన భుగత అనిల్‌(22) కుటుంబం 15ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ అంబేడ్కర్‌ నగర్‌లో స్థిరపడింది. అనిల్‌ హైదరాబాద్‌లోనే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. డిప్లమా సరిఫికెట్లు తెచ్చుకునేందుకు అనిల్‌ శుక్రవారం ఉదయం తన బైక్‌పై ఒంగోలుకు బయలుదేరాడు. మార్గమధ్యలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో మహారాష్ట్ర నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా అనిల్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి లారీడ్రైవర్‌ రిజ్వాన్‌ఖాన్‌ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి జగన్నాథం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఎన్‌.ధర్మ తెలిపారు.

Advertisement
Advertisement