బాక్సింగ్‌ చాంపియన్‌గా శ్రీకాకుళం | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌ చాంపియన్‌గా శ్రీకాకుళం

Published Sun, Nov 19 2023 12:48 AM

-

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం బాక్సింగ్‌ క్రీడాకారులు తొలిసారి చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంలోని పోర్ట్‌ స్టేడియంలో జరిగిన 7వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్‌ పురుషులు, మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో విజేతగా నిలిచి టైటిల్‌ను సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బి.ఎ.లక్ష్మణ్‌ దేవ్‌ అధ్యక్షతన జరిగిన అభినందన కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేకా శ్రీనివాసరావు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా బాక్సర్లు నాలుగు బంగారు, రెండు రజత, మరో ఐదు కాంస్య పతకాలు సాధించి సత్తాచాటారు. డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ శ్రీధర్‌రావు పర్యవేక్షణలో బాక్సింగ్‌ కోచ్‌ కోచ్‌ ఎం.ఉమామహేశ్వరరావు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న తీరును అభినందించారు. కార్యక్రమంలో బాక్సింగ్‌ సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి వంగా మహేష్‌, అసిస్టెంట్‌ కోచ్‌ రాజీవ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement