సంక్షేమ పథం | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథం

Published Fri, Nov 24 2023 2:12 AM

- - Sakshi

మాకు ధైర్యమిచ్చారు

ఇల్లు లేని మాలాంటి వారిని గుర్తించి జగనన్న లేఅవుట్‌తో పాటు పక్కాగా గృహం మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇళ్లలోనే బతుకులీడుస్తున్నాం. అప్పటికప్పుడు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే సామాన్లు తీసుకుని వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య వచ్చేది. కూలి పనులు చేసుకుని అద్దె ఇంట్లో ఉంటే కు టుంబ పోషణ ఇబ్బందిగా ఉండేది. జగనన్న పాలనలో ఇప్పు డు పక్కా ఇల్లు మంజూరు కావడంతో ధైర్యంగా మా ఇంటిలో ఉంటున్నాం. సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే ఆ ధైర్యం వచ్చింది. పక్కా గృహం సకాలంలో నిర్మించి గృహ ప్రవేశం చేసి కుటుంబం అంతా సంతోషంగా ఉంటున్నాం.

– కూన విజయకుమారి,

ఇసుకలపేట గ్రామం,

ఆమదాలవలస మండలం

ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రం

ఈ ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకానికి అర్హత పొందుతున్నందున కుల ధ్రువీకరణ పత్రం అవసరం పడింది. జగనన్న సురక్ష కార్యక్రమంలో మా ఇంటికి వచ్చిన వలంటీర్‌కు విషయం చెప్పి దరఖాస్తు చేయించాను. ఒకే ఒక్క రోజులో ధ్రువీకరణ పత్రం సురక్ష క్యాంపులో నాకు అందజేశారు. ఎలాంటి రుసుం వసూలు చేయలేదు. గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే మండల కేంద్రం చుట్టూ నెలల తరబడి తిరిగితే వచ్చేది. ఒక్క రోజులోనే చేతికి ధ్రువీకరణ పత్రం రావడం ఈ ప్రభుత్వం గొప్పదనం.

– గురుగుబెల్లి గోవిందమ్మ, తొగరాం గ్రామం, ఆమదాలవలస మండలం

1/3

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement