ఎచ్చెర్ల.. అందరూ మెచ్చేలా | Sakshi
Sakshi News home page

ఎచ్చెర్ల.. అందరూ మెచ్చేలా

Published Mon, Nov 27 2023 1:26 AM

- - Sakshi

బుడగుట్లపాలెంలో నిర్మితమవుతున్న ఫిషింగ్‌ హార్బర్‌ మత్స్యకారులకు బంగారు భవిష్యత్‌ను చూపిస్తోంది. ఎస్‌ఎం పురంలోని ట్రిపుల్‌ ఐటీ పేద విద్యార్థుల నుదుటి రాతలను మారుస్తోంది. ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ మేడ్‌ ఇన్‌ శ్రీకాకుళం స్టూడెంట్స్‌ పవర్‌ను ప్రపంచానికి చూపిస్తోంది. ఇంటింటా అందుతున్న సంక్షేమం వెనుకబాటును మెల్లగా రూపుమాపుతోంది. ఎచ్చెర్ల అందరూ మెచ్చేలా ఎదుగుతోంది. ఇన్నాళ్లూ పైడిభీమవరం పారిశ్రామిక వాడతో పేరొందిన ఈ నియోజకవర్గానికి ఇప్పుడు కొత్త కీర్తి కిరీటాలు దక్కనున్నాయి. వైఎస్‌ జగన్‌ సర్కారు చేసిన మేలు ఇది. ఈ మంచిని వివరించేందుకు నేడు సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement