జనం హృదయాల్లో జగన్‌ | Sakshi
Sakshi News home page

జనం హృదయాల్లో జగన్‌

Published Thu, Nov 30 2023 1:20 AM

బొర్రంపేట–స్కాట్‌పేట రోడ్డులో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు   - Sakshi

ఎల్‌.ఎన్‌.పేట: ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనం గుండెల్లో స్ధానం సంపాదించారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం ఎల్‌.ఎన్‌.పేట మండలం బోర్రంపేట నుంచి స్కాట్‌పేట వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మండలంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు పెనుమజ్జి విష్ణుమూర్తి, మండల ప్రత్యేకాహ్వానితుడు రెడ్డి రామారావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కొల్ల కృష్ణ, పార్టీ నాయకులు లోచర్ల మల్లేశ్వరరావు, ముద్దాడ లక్ష్మణరావు, ఎర్ర జనార్దనరావు, బలగ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement