దేశంలో బీజేపీ పతనం ఖాయం | Sakshi
Sakshi News home page

దేశంలో బీజేపీ పతనం ఖాయం

Published Mon, Mar 27 2023 2:16 AM

జోడో యాత్రలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్‌  - Sakshi

మిర్యాలగూడ: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలోనే ప్రజల చేతిలో పతనమవుతుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామం నుంచి మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో చేపట్టే హాత్‌సే – హాత్‌ జోడో యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నారు. 2024లో రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌), పీసీసీ సభ్యుడు చిరుమర్రి కృష్ణయ్య, ఎంపీపీ పుట్టల సునీత, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్‌, పార్టీ మండల అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి, మాడ్గులపల్లి జెడ్పీటీసీ పుల్లెంల సైదులు, సర్పంచ్‌ వల్లంపట్ల ఝాన్సీప్రవీణ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి, రేగటి రవీందర్‌, పల్లా వీరయ్య, పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఫ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement
Advertisement