పోటీలో వ్యాపారులే అధికం | Sakshi
Sakshi News home page

పోటీలో వ్యాపారులే అధికం

Published Thu, Nov 16 2023 6:04 AM

- - Sakshi

పొద్దంతా హైడ్రామా.. చివరకు ఉపసంహరణ

ఈసారి జిల్లాలో పెద్దగా రెబల్స్‌ బెడద లేదు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థి పటేల్‌ రమేష్‌రెడ్డి.. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. బుధవారం సూర్యాపేటలోని పటేల్‌ రమేష్‌రెడ్డి ఇంటికి వారంతా చేరుకోవడంతో ఆయన అనుచరులు కాంగ్రెస్‌ టికెట్‌ ఎందుకు ఇవ్వలేదని దాడికి ప్రయత్నించడం, చివరకు ఎంపీ టికెట్‌ ఆఫర్‌ చేయడంతో చర్చలు ఫలించాయి. ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నల్లగొండలో నామినేషన్‌ వేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కొండేటి మల్లయ్య, నకిరేకల్‌లో నామినేషన్‌ వేసిన కాంగ్రెస్‌ నాయకుడు దైద రవీందర్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక.. జానారెడ్డి, మోత్కుపల్లి నర్సిహులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

యువ ఆధిపత్యం

తొలిసారి బరిగీసి..

72 మంది గ్రాడ్యుయేట్లు

1/1

Advertisement
Advertisement