కాంగ్రెస్‌ హామీలు ఆచరణ సాధ్యం కావు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హామీలు ఆచరణ సాధ్యం కావు

Published Sun, Nov 19 2023 2:00 AM

మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి  - Sakshi

నల్లగొండ టూటౌన్‌: కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఆచరణలో సాధ్యం కావని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ మీద అక్కసు వెళ్లగక్కడం ఒక్కటే కాంగ్రెస్‌ పార్టీ పని అని, ఖర్గేను డమ్మీగా పెట్టి కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోదీ పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచిన విషయం ప్రజలు మరిచి పోలేదన్నారు. కేంద్రం బీఆర్‌ఎస్‌ నాయకులపై పగబట్టి వారి అనుచరులపై ఐటీ దాడులు చేసి ఎన్నికల సమయంలో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ అభ్యర్థి లింగయ్యపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఫ కోమటిరెడ్డి బ్రదర్స్‌

ఆత్మవిమర్శ చేసుకోవాలి

ఫ శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement