ఈసీఐఎల్‌ నుంచి తెప్పించి.. | Sakshi
Sakshi News home page

ఈసీఐఎల్‌ నుంచి తెప్పించి..

Published Sun, Nov 19 2023 2:00 AM

-

గతంలో జిల్లాకు 2,435 బ్యాలెట్‌ యూనిట్లు, 1911 కంట్రోల్‌ యూనిట్లు, 1863 వీవీప్యాట్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత ర్యాండమైజేషన్‌ చేసి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని 308 పోలింగ్‌ కేంద్రాలకు 385 బ్యాలెట్‌ యూనిట్లు, కోదాడ నియోజకవర్గంలోని 296 పోలింగ్‌ కేంద్రాలకు 372, సూర్యాపేట నియోజకవర్గంలోని 271 పోలింగ్‌ కేంద్రాలకు 338, తుంగతుర్తిలోని 326 పోలింగ్‌ కేంద్రాలకు 407 బ్యాలెట్‌ యూనిట్లు కేటాయించారు. అనంతరం వాటిని ఆయా నియోజకవర్గాలకు తరలించారు. జిల్లాలో మిగిలి ఉన్న బ్యాలెట్‌ యూనిట్లు కాక అవసరం ఉన్న 570 బ్యాలెట్‌ యూనిట్లను శుక్రవారం తీసుకువచ్చారు. ర్యాండమైజేషన్‌ చేసి మూడు నియోజకవర్గాలకు అవసరాల మేరకు కేటాయించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement