రెండేళ్లకే నూరేళ్లు! | Sakshi
Sakshi News home page

రెండేళ్లకే నూరేళ్లు!

Published Mon, Mar 25 2024 1:25 AM

ప్రేమ్‌ (ఫైల్‌) - Sakshi

క్రేన్‌ ఢీకొని బాలుడు మృతి

కొండమల్లేపల్లి : క్రేన్‌ ఢీకొని రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన

కొండమల్లేపల్లి మండల పరిధిలోని కోల్‌ముంతలపహాడ్‌ గ్రామపంచాయతీ పరిధిలోని బాపూజీనగర్‌ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని బాపూజీనగర్‌ గ్రామంలో 167వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటిలో రమావత్‌ బాలు నివాసం ఉంటున్నాడు. ఇతడి కుమారుడు రమావత్‌ ప్రేమ్‌ (2) ఇంటి ఆవరణలో రోడ్డుకు సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వచ్చిన క్రేన్‌ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి త్రండి రమావత్‌ బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు.

Advertisement
Advertisement