నకిలీ పత్రాల కేసులో ఎస్‌ఐకు డీ ప్రమోషన్‌ | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాల కేసులో ఎస్‌ఐకు డీ ప్రమోషన్‌

Published Thu, Mar 16 2023 1:44 AM

-

తిరువొత్తియూరు: నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తూ మోసానికి పాల్పడుతున్న కేసులో నిందితుడైన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను కానిస్టేబుల్‌గా డి ప్రమోట్‌ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. కోవై జిల్లా సర్కిల్‌కు చెందిన కో మంగళం పోలీస్‌స్టేషన్లో సంవత్సరం క్రితం వరకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న మణిమారన్‌ వాహన ప్రమాదాలకు సంబంధించి నకిలీ ఆధారాలు తయారు చేసి బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ తరువాత ఇన్‌స్పెక్టర్‌ మణిమారన్‌ను డిప్రమోట్‌ చేసి కున్నత్తూరు పోలీసుస్టేషన్‌కు కానిస్టేబుల్‌గా బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులను కోవై డీఐజీ విజయ్‌కుమార్‌ జారీ చేశారు.

Advertisement
Advertisement