రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Published Thu, Apr 27 2023 1:36 AM

-

అన్నానగర్‌: వ్యాన్‌, బైక్‌ ఢీకొన్న ఘటనలో దంపతులు మృతిచెందారు. పుదుకోట్ట జిల్లా, ఆవుడయార్‌ తాలూకా అమరడక్కి గ్రామానికి చెందిన అశోకన్‌ (50). ఇతని భార్య రాణి (40). వీరిద్దరూ రామనాథపురం జిల్లా తొండి సమీపంలోని తీర్థండ తాణం గ్రామంలోని కులదైవ ఆలయానికి మొక్కలు చెల్లించుకునేందుకు వెళ్లారు. అనంతరం బుధవారం వేకువజామున ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు మీదుగా పట్టణానికి తిరిగి వెళుతున్నారు. ఎస్‌పి పట్టినం కల్వ ఊరని సమీపంలోకి వెళ్లగా కేరళ రాష్ట్రానికి చెందిన టూరిస్టు వ్యాన్‌, బైక్‌ ఢీకొన్నాయి. అశోకన్‌, రాణి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ పట్టినం ఎస్‌ఐ కాళీశ్వరన్‌, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అశోకన్‌, రాణి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువాడనై ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement