ఫీజు కోసం బతిమిలాడితే.. హోటల్‌కు తీసుకెళ్లి.. | Sakshi
Sakshi News home page

ఫీజు కోసం బతిమిలాడితే.. హోటల్‌కు తీసుకెళ్లి..

Published Mon, May 1 2023 6:00 AM

- - Sakshi

తమిళనాడు: నీలగిరి జిల్లాకు చెందిన విద్యార్థినిని (21)ని స్నేహితులు బంధించి మూడు రోజులు లైంగిక దాడి చేశారు. కోయంబత్తూరులోని ఓ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి శరవణం పట్టి ప్రాంతానికి చెందిన రవీంద్రన్‌ (24), జర్మన్‌ రాజేష్‌ (25)తో పరిచయం ఏర్పడింది. రవీంద్రన్‌ రెండేళ్లుగా కాలేజీకి వెళ్లకుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

జర్మన్‌ రాజేష్‌ కూలీ పనిచేస్తున్నాడు. విద్యార్థినికి కళాశాల ఫీజు చెల్లించాల్సిన అవసరం వచ్చింది. ఆమె రవీంద్రన్‌ వద్దకు వెళ్లి నగదు సాయం చేయాలని కోరింది. అతను రెండు రోజుల క్రితమే డబ్బులు సిద్ధం చేశానని, శరవణంపట్టిలోని రెస్టారెంట్‌ వద్దకు వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఆమెను రవీంద్రన్‌ హోటల్‌లోని గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలో జర్మన్‌ రాజేష్‌ ఉన్నాడు.

ఇద్దరూ తలుపులు వేసి విద్యార్థినిని బెదిరించి లైంగిక దాడి చేశారు. అనంతరం గదిలో బంధించారు. 3 రోజులు లైంగిక దాడి చేశారు. ఈ విషయాలను ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి పంపించారు. ఆమె శనివారం కోయంబత్తూరు ఈస్ట్‌ ఆల్‌ ఉమెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి రవీంద్రన్‌, జర్మన్‌ రాజేష్‌ను అరెస్టు చేశారు.

Advertisement
Advertisement