కొరుక్కుపేట: మద్రాసు నగరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఒక నాటి రాజధాని మాత్రమే కాదని, అలనాటి తెలుగు సాహిత్య రాజధాని కూడా అని ఇండియన్ బ్యాంకు – విజయవాడ విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొప్పర్తి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 136వ ప్రసంగం మద్రాసు తెలుగు కథకులు అనే అంశంపై ఆదివారం రాత్రి నిర్వహించారు. స్థానిక టి. నగర్లోని ఆంధ్రా క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వక్తగా కొప్పర్తి రాంబాబు పాల్గొని మాట్లాడారు. మద్రాసు తెలుగు కథకులు అనగానే మనకు గుర్తుకు వచ్చే కథకులు ఆ నగరానికి పరిమితమై కథలు రాసిన వారు కాదని, తెలుగు కథా సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేసి తెలుగు కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఖ్యాతి తెచ్చిన మహనీయులు అన్నారు. మద్రాసు నగరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఒక నాటి రాజధాని మాత్రమే కాదని అలనాటి తెలుగు సాహిత్య రాజధాని కూడా అభిప్రాయపడ్డారు. ఎన్నో పత్రికలు తెలుగు వారి సాహిత్య కళా సాంస్కృతిక రంగాలు సుసంపన్నం కావడానికి దోహదం చేశాయని తెలిపారు. తెలుగు రచయితల సృజన కారుల కృషిని ప్రచారంలోకి తీసుకు వచ్చి నిక్షిప్తం చేశాయని కొనియాడారు. తెలుగు కథకు పరిమళాలు అద్దిన మల్లాది రామకృష్ణ శాస్తిర, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు, హేతువాదాన్ని కథల్లో ఇమిడ్చిన గురజాడ, ఇంకా లెక్చర్స్ రూపంలో శాశ్వితం చేసిన ముళ్లపూడి వెంకటరమణ, అత్తగారి కథలు రాసిన భానుమతి రామకృష్ణ, శ్రీశ్రీ, ఆరుద్ర కె. రామలక్ష్మి, మాలతీ చందూర్, ఎన్నార్ చందూర్, చక్రపాణి, వేటూరి సుందర రామమూర్తి ఇలా ఎందరో ప్రముఖులు జ్ఞప్తికి వస్తారని వివరించి ఆకట్టుకున్నారు. ముందుగా స్వాగతోసన్యాసంను వేదిక కార్యదర్శి మధు చేయగా, వక్తను వేదిక అధ్యక్షుడు జేకే రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా వక్త కొప్పర్తి రాంబాబును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
తెలుగు సాహిత్య రాజధాని మద్రాసు
Published Mon, May 1 2023 6:00 AM
1/1
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement