విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి

Published Tue, May 9 2023 1:34 AM

-

అన్నానగర్‌: ఆవడిలో విద్యుత్‌ షాక్‌తో పదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. చైన్నె ఆవడి పాలవేడు ఆంజనేయర్‌ కోవిల్‌ వీధికి చెందిన గుణశేఖరన్‌, లక్ష్మి దంపతులకు కుమార్తె అభినయ (15), కుమారుడు గోపి (17) ఉన్నారు. పాలవేడు ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆదివారం గుణశేఖరన్‌ తన భార్య, కుమార్తెతో కలిసి మాధవరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో గోపి, అతని అమ్మమ్మ మురుగమ్మ మాత్రమే ఉన్నారు. గోపి ఇంటి బయట ఉన్న బాత్‌రూమ్‌కి రాత్రి వెళ్లినప్పుడు గోడపై ఉన్న విద్యుత్‌ వైరుపై చేయి వేయడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కిందపడడంతో తల వెనుక భాగంలో బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. మనవడు బాత్రూమ్‌ నుంచి రాకపోవడంతో మురుగమ్మ అక్కడికి వెళ్లి చూసింది. రక్తపు మడుగులో పడి ఉన్న గోపిని ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ముత్తాపుదుప్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement