Sakshi News home page

కొల్లిడంలో ముగ్గురు గల్లంతు

Published Mon, May 15 2023 1:12 AM

-

సాక్షి, చైన్నె: కొల్లిడం నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం బయటపడింది. తిరుచ్చి శ్రీరంగం కావేరి తీరంలో శ్రీమన్‌ గురుకులం పేరిట వేద పాఠశాల ఉంది. ఇక్కడ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. కావేరి తీరంలో కొల్లిడం నదీ సైతం ప్రవహిస్తోంది. ఉదయాన్నే ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఇందులో మన్నార్‌కుడికి చెందిన విష్ణుప్రసాద్‌, హరిప్రసాద్‌, ఆంధ్రాకు చెందిన అభిరాం ఉన్నారు. ఇందు లో ఒకరి మృతదేహం సాయంత్రం బయట పడింది. కొల్లిడంలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో గల్లంతైన మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement