చెట్టును బైక్‌ ఢీకొని సిద్ధ వైద్యుడు మృతి | Sakshi
Sakshi News home page

చెట్టును బైక్‌ ఢీకొని సిద్ధ వైద్యుడు మృతి

Published Thu, May 25 2023 1:44 AM

-

అన్నానగర్‌: చెట్టును బైక్‌ను ఢీకొని ఓ సిద్ధ వైద్యుడు మృతిచెందాడు. తెన్‌కాశి జిల్లా శంకరన్‌ కోవిల్‌ సమీపంలోని కురువికులం సీఎస్‌ఐ చర్చి వీధికి చెందిన సత్యరాజు కుమారుడు జయకుమార్‌ (23). కేరళలో సిద్ధ వైద్యం కోర్సు పూర్తి చేశాడు. ఇతని స్నేహితుడు అదే ప్రాంతానికి చెందిన ఇన్నాసి ముత్తు కుమారుడు శివబాలన్‌ (19). పుత్తూరులోని కాలేజీలో క్యాటరింగ్‌ పూర్తి చేశాడు. ఈ స్థితిలో క్యాటరింగ్‌ కళాశాలలో సర్టిఫికెట్‌ తీసుకునేందుకు శివబాలన్‌, జయకుమార్‌ బైకులో బుధవారం ఉదయం బయలుదేరారు. కోవిల్‌పట్టి నుంచి కలుగుమలై వెళుతుండగా కల్లూరని వద్దకు రాగానే బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న చింతచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో జయకుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శివబాలన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న నాలాట్టిన్‌ పుత్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జయకుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవిల్‌పట్టి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడ్డ శివబాలన్‌ను నెల్‌లై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement