మూడు బైకులు ఢీ– ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

మూడు బైకులు ఢీ– ఇద్దరి మృతి

Published Wed, Jun 7 2023 12:40 AM

-

అన్నానగర్‌: సిరుముగై సమీపంలో సోమవారం రాత్రి మూడు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం సమీపంలోని అన్నూర్‌ తాలూకాలోని కరనూర్‌ ప్రాంతానికి చెందిన శేఖర్‌ (30). తిరుపూర్‌ బనియన్‌ కంపెనీలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శాలిని. వీరికి ప్రతీక్ష(5) అనే కూతురు ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి శేఖర్‌ సిరుముగై పక్కనే ఉన్న తిమ్మరాయంపాలెంలోని తన బావ ఇంటి నుంచి బైకులో తిరిగి వస్తున్నాడు. అదేవిధంగా లింగాపురం ప్రాంతానికి చెందిన ఫ్యాన్సీ స్టోర్‌ యజమాని నవీన్‌ కుమార్‌ (30), సిరుముగై థియేటర్‌ మేడు ప్రాంతానికి చెందిన హరిహరన్‌ (25) కలిసి మరో బైకుపై అటువైపు వచ్చారు. సిరుముగై సమీపంలోని వెల్లికుప్పంపాళయం ప్రాంతానికి రాగానే అకస్మాత్తుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. అప్పుడు అటుగా వస్తున్న మరో బైకు, వీటిని ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శేఖర్‌, నవీన్‌ కుమార్‌ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. హరిహర్‌న్‌, మరో ద్విచక్రవాహనదారుడు కరుప్పుసామికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న సిరుముగై పోలీసులు గాయపడిన హరిహరన్‌ను కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి, కరుప్పుసామిని సిరుముగైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మేట్టుపాళయం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నవీన్‌కుమార్‌కు భార్య నిషా, కుమార్తె సాయీదా (4) ఉన్నారు. సిరుముగై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement