యువతి ప్రాణం తీసిన ప్రేమోన్మాది | Sakshi
Sakshi News home page

యువతి ప్రాణం తీసిన ప్రేమోన్మాది

Published Thu, Jun 8 2023 1:52 AM

ఆందోళన చేస్తున్న ప్రజలు  - Sakshi

అన్నానగర్‌: యువతిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. ఓల్డ్‌ రైల్వే లైన్‌ ప్రాంతానికి చెందిన భువనేశ్వరన్‌ కుమార్తె హర్ష (23) బుధవారం ఉదయం అతియామాన్‌కోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కదురన్‌ కోటై నరసింగపురం కొంబై అటవీ ప్రాంతంలో హత్యకు గురైంది. పక్కనే ట్రావెల్‌ బ్యాగ్‌ పడి ఉంది. అటుగా వెళుతున్న ప్రజలు అదియమాన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హర్ష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులు ఆ ప్రాంత ప్రజలను విచారించారు. మంగళవారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఓ యువకుడు హర్షతో మాట్లాడుతుండగా వాగ్వాదానికి దిగాడని తెలిపారు. కాగా యువకుడిని పెళ్లి చేసుకోవడానికి హర్ష ఇంటి నుంచి వెళ్లిందని.. అయితే అతను నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement