కులధ్రువీకరణ పత్రాల పంపిణీ | Sakshi
Sakshi News home page

కులధ్రువీకరణ పత్రాల పంపిణీ

Published Sun, Sep 10 2023 2:08 AM

ఎస్టీలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే రాజేంద్రన్‌   - Sakshi

తిరువళ్లూరు: పట్టణంలోని 26 వార్డుకు చెందిన 47 మంది ఎస్టీలకు కులధ్రువీకరణ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ తన కార్యాలయంలో శనివారం ఉదయం అందజేశారు. ఈ వార్డులో సుమారు వంద ఎస్టీ కుటుంబాలు ఉంటున్నాయి. వీరికి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు అందించాలని పలుమార్లు ఆర్డీఓతో సహా పలువురు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే సర్టిఫికెట్లను అందించడానికి అవసరమైన లింక్‌ ఆధారాలు లేకపోవడంతో అధికారులు నిరాకరించారు. దీంతో సంబంధిత కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ ధనలక్ష్మి ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపించి 47 మందికి కులధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ ఉదయమలర్‌పాండ్యన్‌, యూనియన్‌ కౌన్సిలర్‌ మంజూ లింగేష్‌, తమిళనాడు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ బోర్డు రాష్ట్ర కమిటీ సభ్యుడు హరీష్‌, జిల్లా కౌన్సిలర్‌ విజయకుమారి, పార్టీ నేతలు నేతాజీ, కమలకన్నన్‌ పాల్గొనారు.

Advertisement
Advertisement