పూండి రిజర్వాయర్‌ పరిశీలన | Sakshi
Sakshi News home page

పూండి రిజర్వాయర్‌ పరిశీలన

Published Mon, Oct 23 2023 1:50 AM

పూండి రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌  - Sakshi

తిరువళ్లూరు: ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభుశంకర్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం పూండి రిజర్వాయర్‌ను తనిఖీ చేశారు. ముందుగా రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్న కలెక్టర్‌ పూండి రిజర్వాయర్‌కు ప్రధాన నీటి ఆధారం, ఇన్‌, అవుట్‌ఫ్లో, ప్రస్తుతం నీటి నిల్వలు, షట్టర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. రెండు నెలల క్రితం ఎంత నీటిని దిగువకు విడుదల, కుశస్థలి, కూవం నదుల్లో కొత్త ఆ నకట్టలు ఎక్కడ అవసరమనే అంశంపై ఆరా తీశారు. అనంతరం పూండి రిజర్వాయర్‌కు సమీపంలో ఏర్పాటు కానున్న గ్రీన్‌పార్క్‌ పనులపై ఆరా తీయడంతో పాటు పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మరమ్మతు లకు గురైన షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్ల ఏర్పాటు చేయడం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుళల్‌, చెమరంబాక్కం రిజర్వాయర్‌లకు నీటి విడుదలను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎస్టీఓ సత్యనారాయణన్‌, ఏఈ రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement