పుస్తక పఠనంతో విజ్ఞానం | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతో విజ్ఞానం

Published Wed, Nov 15 2023 1:42 AM

 పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ - Sakshi

వేలూరు: పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వేలూరు అన్నా రోడ్డులోని సెంట్రల్‌ లైబ్రరీలో పుస్తక ప్రదర్శనను కలెక్టర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయంలో సాధారణ పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఉంచారని తెలిపారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తకాలతో పాటు దిన పత్రికలు చదవడం వల్ల మేథాశక్తి పెరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ అధికారి పయణి, అసిస్టెంట్‌ అధికారి శివకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement