సాక్షి, చైన్నె: తమిళనాడు, పుదుచ్చేరి టీటీడీ స్థానిక సలహా మండలి (ఎల్ఏసీ)కి 44 మంది సభ్యులను నియమించారు. ఇందులో నలుగురు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ మేరకు టీటీడీ డిప్యూటీ ఈఓ (జనరల్) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. చైన్నె టీనగర్ వెంకటనారాయణ రోడ్డులో తిరుమల శ్రీవారి ఆలయం, సమాచార కేంద్రం ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని టీటీడీ ఆలయాలను స్థానిక సలహా కమిటీ పర్యవేక్షించడం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక సలహా కమిటీ చైర్మన్గా ఏజే శేఖర్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం 44 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఉపాధ్యక్షులుగా నలుగురు ఉన్నారు. తాజా జాబితాలో కొందరు మాజీ సభ్యులకు మరోసారి అవకాశం ఇచ్చారు. అలాగే కొత్తవారికి కూడా అవకాశం కల్పించారు.
ఉపాధ్యక్షులు వీరే..
టీటీడీ స్థానికసలహా కమిటీ ఉపాధ్యక్షులుగా కె.ఆనందకుమార్, ఎస్ ఎస్ సుదంతిరం, వీఎల్ వెంకట సుబ్రమణియం, మరు శ్రీ శరణ్ను నియమించారు.
సభ్యులుగా..
స్థానిక సలహా మండలి సభ్యులుగా ఎం.ప్రభాకరరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, కె. అనిల్కుమార్ రెడ్డి, కల్కి రంగారెడ్డి, పీవీఆర్ కృష్ణారావు, రవీంద్ర సన్నారెడ్డి, బి.మోహన్పద్మనాభరావు, అజయ్ తాతినేని, ఈ. కృష్ణారెడ్డి, జీఏ పృథ్వీ, వీఆర్ వెంకటాచలం, ఎస్.కార్తికేయన్, కేఎస్ జయరామన్, డాక్టర్ పి.ధీరజ్ రెడ్డి, ఇందిరా రాజేంద్రన్, నరేష్ సుబ్రమణి, మలా శంకర్, టీఎల్ యువరాజ్, గిరిధరన్, ఎస్.నాగరాజన్, ఊరా లక్ష్మీనరసింహరావు, డాక్టర్ ఐసరి కె.గణేష్, రామజయం, వి.గోపాలకృష్ణన్, వేమిరెడ్డి సందీప్ రెడ్డి, షెణ్మగమూర్తి, ఎల్.సుధాకరరెడ్డి, మల్లిపెద్ది అశోక్ కృష్ణలను నియమించారు. అలాగే జె.మురుగేశన్, ఎం.ప్రతాప్రెడ్డి, డీబీ సుబ్రమణ్యం, ఎం.రాజేంద్రకుమార్, మోహన్కుమార్ వెంకటేశన్, వి.సత్యనారాయణన్, డాక్టర్ సీఎం కిషోర్, ఎంపీ జయదేవరావు, సి.శరవణన్, ఆర్.పన్నీర్సెల్వం, డి.రాధాకృష్ణమూర్తి, కె.గాయత్రి దేవీ సభ్యులుగా నియమితులయ్యారు.
ఉత్తర్వులు జారీ చేసిన
తిరుమల తిరుపతి దేవస్థానం